Breaking News

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ : మన్నె శంతన్ కుమార్

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్య పేట పట్టణంలో నిరాశ్రయులకు యాచకులకు లెప్రసీ బాధితులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన్నె శంతన్ కుమార్ ఆర్థిక వితరణ తో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శంతన్ కుమార్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన్నె శ్రీనివాస రావు కేసర రాంబాబు ప్రఫుల్ల శ్రీకాంత్ లాక్ డౌన్ విధించిన మొదటి రోజే ప్రప్రథమంగా సంబంధిత బాధితులకు డ్రైవర్లకు ఆహారాన్ని అందించడం సంతోషకరమని ఆ తర్వాత నుండి మా బంధు వర్గాల ద్వారా కరోనా కష్టకాలంలో పేదలకు అండగా సహాయం చేయమని ప్రస్తుతం శీతాకాలం కారణంగా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న యాచకులకు నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు అనంతరం మన్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉందని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడమే కాక ప్రజా సమస్యలపై పోరాడుతూ నిరంతరం ప్రజలకు అండగా ఉంటామని యువత భారతీయ జనతా పార్టీలో భాగస్వాములై దేశం కోసం మెరుగైన సమాజం కోసం పాటుపడటం శుభ పరిణామమని ఆయన అన్నారు జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మన్నె శ్రావణ్ కుమార్ మన్నె హరిత లతో పాటు పట్టణ ప్రధాన కార్యదర్శి గోలి రాఘవ రూరల్ ఇంచార్జ్ కిషోర్ బాబు భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సుమన్ అఖిల్ రాజారావు తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *