Breaking News

భీమవరంలో రొయ్యల వ్యాపారి అదృశ్యం

భీమవరంలో కిడ్నాప్‌..అచ్యుతాపురంలో హత్య

అశ్వరావుపేట: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భీమవరం వాసి హత్యకు గురయ్యాడు. అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం వద్ద మంగళవారం ఉదయం మృతదేహాన్ని గర్తించారు. వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి, అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు భీమవరంలో కిడ్నాప్‌ చేసి అచ్యుతాపురం తీసుకొచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు వెల్లడించారు. ఇక్కడి పోలీసులు భీమవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భీమవరంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *