Breaking News

మంత్రి పేర్ని నానికి మాతృవియోగం

తెలుగు తేజం, మచిలీపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని)కి మాతృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి నాగేశ్వరమ్మ(82) మచిలీపట్నంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. గురువారం ఉదయం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వరమ్మ భర్త పేర్ని కృష్ణమూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆమె పార్థీవదేహాన్ని స్వగృహానికి తరలించి.. పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులర్పి్ంచారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆళ్లనాని, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఉపసభాపతి బొరగడ్డ వేదవ్యాస్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *