Breaking News

మచిలీపట్టణం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై హత్యాయత్నం

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్‌ బాషాపై హత్యాయత్నం జరిగింది. ఖాదర్‌ బాషా ఇంట్లో ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఖాదర్‌ బాషాకు 40శాతానికి పైగా గాయాలయ్యాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడిని చికిత్స కోసం పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఖాదర్‌బాషా భార్యపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *