Breaking News

మరోసారి సత్తా చాటాలని సూచించిన ఎమ్మెల్యే వసంత

తెలుగు తేజం, మైలవరం: వెల్వడం గ్రామ సత్తా చూపాలని భారీ మెజారిటీ తో విజయం సాధించాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సూచించారు. నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం వెల్వడం గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పత్తిపాటి దర్మరాజు ,వార్డు మెంబర్ లు స్థానిక నాయకులు మైలవరం పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కంచుకోటగా ఉన్న వెల్వడం గ్రామంలో గెలుపు గురించి కాకుండా ప్రత్యర్ది పార్టీలకు డిపాజిట్ లు కూడ దక్కకుండా మరోసారి మన సత్తా చాటాలని సూచించారు.సర్పంచ్ గ్రామ అభివృద్దికి కీలకమని అందరిని కలుపుకుని ముందుకు సాగాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *