Breaking News

గొల్లపూడి వైసీపీ కార్యాలయం లో గాంధీజీ వర్ధంతి నివాళి-చనుమోలు రాము

తెలుగు తేజం , గొల్లపూడి : జాతిపిత మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిర్మించడానికి జగనన్న ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కారెంపూడి సురేష్ స్పష్టం చేశారు.గాంధీజీ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యాలయ సిబ్బంది మహాత్ముడి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే గ్రామ వార్డు సచివాయం వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని తెలిపారు.నేటి తరం యువత బాపూజీ చూపిన అహింస మార్గాన్ని ఎంచుకొని సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు…

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *