Breaking News

మున్నలూరు గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

తెలుగు తేజం, కంచికచర్ల : 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో ఏర్పాటు చేసిని ఓటర్ డే కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు అతి పవిత్రమైనదని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్లమండల యూత్ కన్వీనర్ రాయల నరసింహారావు , మున్నలూరు గ్రామ కన్వీనర్ సూర్యదేవర శ్రీనివాసరావు, స్కీం వైస్ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, చిరుమామిళ్ళ నరసింహారావు, తేళ్ళశ్రీనివాసరావు. తేళ్ళ లోకేష్ మరియు వీఆర్వో ప్రదర్శన రావు, గ్రామ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు నమోదు చేసుకోవాలని కంచికచర్ల మండల యూత్ కన్వీనర్ రాయల్ నరసింహారావు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *