Breaking News

రేషన్ బియ్యం సరఫరా వాహనాలు ట్రయిల్ రన్

తెలుగు తేజం, నందిగామ : స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలు ద్వారా సోమవారం ట్రయిల్ రన్ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ వి రాజకుమారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ బియ్యాన్ని ఇంటింటికి ఏ విధంగా సరఫరా చేస్తారో ప్రజలు, డీలర్లు, అధికారుల సమక్షంలో కాటాలు వేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఐ శిరీష, సీనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, విఆర్యో లు బ్రహ్మం, కాంతారావు, అనూష, పలువురు డీలర్లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *