Breaking News

రూ.1.80 కోట్ల నగదుతో గంగానమ్మకు అలంకరణ

జంగారెడ్డిగూడెం: ప.గో జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీగంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో గంగానమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారిని రూ.1.80 కోట్ల నగదుతో అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఇవాళ గంగానమ్మకు అభిషేకాలు నిర్వహించారు. అలాగే సామూహిక కుంకుమ పూజలు, లలితా, విష్ణు సహస్రనామ పారాయణాలు జరిగాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *