Breaking News

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : రైతు సంఘాలు

తెలుగు తేజం, నందిగామ : రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని రైతు సంఘాల ఆధ్వరంలో మంగళవారం గాంధీ సెంటర్ లో కవాతు నిర్వహించారు. ఈ కవాతు లో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు . ఢిల్లీలో లక్షలాది మంది రైతులు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రెండు లక్షల ట్రాక్టర్లతో కేంద్ర ప్రభుత్వానికి మూడు చట్టాలను రద్దు చేయాలని నిరసన తెలియజేస్తున్న రైతులకు మద్దతుగా నందిగామ గాంధీ సెంటర్ లో రైతు సంఘాలు ప్రజా సంఘాలు వివిధ కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పోల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *