Breaking News

కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్ ఐ జె.లక్ష్మి

తెలుగు తేజం, కంచికచర్ల : 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ జె.లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న పరాయి దేశస్తులు నుంచి ఎన్నో పోరాటాల ద్వారా మన దేశానికి స్వతంత్రం తెచ్చుకుని రోజు స్వతంత్రం తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా భారతదేశం లో అతి పెద్ద రాజ్యాంగం ని రాసి 1950 జనవరి 26 వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గా జనవరి 26 వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని కావున విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చదువు ద్వారానే అసమానతలు తొలగిపోతాయని చెప్పిన అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సిబ్బందికిఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జె. లక్ష్మి, ఏ ఎస్ ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ దుర్గారావు, శ్రీనివాసరావు మరియు స్థానిక ఇంజనీరింగ్ కళాశాల పి డి స్టేషన్ సిబ్బంది హోంగార్డు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *