Breaking News

వత్సవాయిలో ఎరువులు,పురుగుల మందుల దుకాణాల్లో తనిఖిలు

తెలుగుతేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలో ఎరువులు మరియు పురుగుల మందుల దుకాణాలను జగ్గయ్యపేట సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ శ్రీనివాసరావు తనిఖిలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వివిధ కంపెనీలకు సంబంధించిన బయో ఉత్పత్తులు పరిశీలించడం జరిగింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వారు ధ్రువీకరించిన కంపెనీలకు సంబంధించిన బయో ఉత్పత్తులు మాత్రమే అమ్మకాలు కొనసాగించాలని డీలర్లకు సూచనలు ఇవ్వడం జరిగింది. దుకాణాలకు వచ్చిన రైతులతో మాట్లాడుతూ బయో ఉత్పత్తులకు సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే తక్షణమే మండల వ్యవసాయ అధికారి ని సంప్రదించవలసినదిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల వ్యవసాయ అధికారి వి రవి కుమార్, గ్రామ వ్యవసాయ సహాయకులు యమ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *