Breaking News

వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి: మంత్రి ఆళ్ల నాని

తెలుగు తేజం, అమరావతి: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితుల్ని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఏలూరు నుంచి మొత్తం 25 మంది బాధితులు విజయవాడ ఆస్పత్రికి రాగా అందులో ఇద్దరు డిశ్ఛార్జి అయ్యారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన వాళ్లకు ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు వింత వ్యాధితో చనిపోలేదని వైద్యులు నిర్ధారించినట్లు మంత్రి తెలిపారు. ఒకరు కొవిడ్‌, మరొకరు గుండెపోటుతో చనిపోయారన్నారు. ఏలూరులో నీటిట్యాంకులను క్లోరినేషన్ చేస్తున్నామని.. ప్రజల భయపడాల్సిన అవసరం లేదన్నారు. రేపు సాయంత్రంలోపు అన్ని సంస్థల నుంచి పరీక్షల ఫలితాలు వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు. బాధితుల రక్తనమూనాల్లో సీసం, నికెల్‌ అవశేషాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. భార లోహాలు రక్తంలో ఎలా కలిశాయనే విషయంపై అధ్యయనం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఈ వింతవ్యాధికి సంబంధించిన కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని.. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆళ్ల నాని వివరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *