Breaking News

విజయవంతంగా ముగిసిన కంప్యూటర్ శిక్షణా తరగతులు

-మధర్ ధెరిస్సా ట్రస్ట్ వారి సహకారంతో….

తెలుగు తేజం, మైలవరం : టాటా ట్రస్ట్, సిపియఫ్ వారి అధ్యర్యంలో మధర్ ధెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరుద్యోగ యవతకు కంప్యూటర్ కోర్సు పూర్తయిన శుభ సందర్బంలో శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రాలను అందజేసారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టాటా ట్రస్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ అల్లాబక్షు మరియు కోయా సుధ మాట్లాడుతూ…గ్రామీణ ప్రాంతం లోని మహిళల కోసం యువత కోసం తమ సంస్థ ద్వార ఎన్నో శిక్షణ కార్యక్రమాలను అందించడం కోసం తమ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అనంతరం రాబోయో కాలంలో యవతకు ఉపయోగ పడే డ్రైవింగ్, సిసి టివి,కంప్యూటర్ ట్రైనింగ్ శిక్షణ లు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి శ్రీనివాస్ , స్కిల్ మిత్ర రాధిక,మధు,సాయి,సిబ్బంది అనిల్ కుమార్,వీరరాజు. సిపియఫ్ ప్రాజెక్టు సమన్వయకర్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *