Breaking News

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

తెలుగు తేజం, గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెంలో షాక్ తగిలి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటూ చేసుకుంది. గ్రామానికి చెందిని గౌరినేని విశ్వేశ్వర రావు (35) వ్యవసాయ పనులు చేస్తుంటాడు . అతని ఇంటి సమీపంలోని పశువుల చావిడి వద్ద ఐదు వానరాలు చనిపోయి పడి ఉండడం గమనించి ఏమి జరిగిందో చూదాం మని తన తల్లి, భార్య తో కలసి విశ్వేశ్వర రావు వెళ్లారు. ఈ క్రమంలో అప్పటికే విద్యుత్ తీగలు తెగి పడి పశువుల చావిడికి వేసిన ఇనుప కంచెకు తాకిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. వారు వెళ్లి దానిని పట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి విశ్వేశ్వర రావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తల్లి, భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామంలో నిత్యం వందల సంఖ్యలో వానరాలు సంచరిస్తూ విద్యుత్ తీగలను నాశనం చేస్తున్నయాని, వీటిని విద్యుత్ అధికారులు సరిచేయక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *