Breaking News

శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు

తెలుగుతేజం, జగ్గయ్యపేట రూరల్ : జగ్గయ్యపేట రూరల్ మండలం వేదాద్రి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రికార్డు స్థాయిలో శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 2 నెలల 27 రోజులకు గాను రూ. 23,38,934/- (అక్షరాల ఇరవది మూడు లక్షల ముప్పది ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయిలు ) మరియు నిత్య అన్నదాన సత్రం నందు హుండీ ద్వారా రు. 28,860/- (అక్షరాల ఇరువది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయిలు ) ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ కానూరి సురేష్ బాబు తెలిపారు. ఈ యొక్క హుండీల లెక్కింపు దేవదాయ శాఖ, నందిగామ డివిజన్, ఇన్స్పెక్టర్ సి హెచ్ బాబు సమక్షంలో దేవస్థాన సిబ్బంది మరియు శ్రీ దుర్గ శివ సాయి సేవా సంగం విజయవాడ వారిచే జరుపబడింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *