Breaking News

సచివాలయములపై ఆకస్మిక తనిఖిచేసిన : మునిసిపల్ కమీషనర్ ఎం. సుభాస్ చంద్ర బోస్

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మునిసిపల్ కమీషనర్ ఎం. సుభాస్ చంద్ర బోస్ గారు ఈ రోజు పురపాలక సంఘ పరిధిలో ఉన్న 15 సచివాలయములపై ఆకస్మిక తనిఖి నిర్వహించారు. దీనిలో భాగంగా సచివాలయముల నందు రికార్డులను, పోస్టర్ల డిస్ప్లే హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. సచివాలయ నిర్వహణలో అసంతృప్తిగా వ్యవహరిస్తున్న సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చేయమని CC సునీల్ బాబుకు తెలియచేసారు. వార్డు సచివాలయ సిబ్బందికి సచివాలయముల నిర్వహణపై తగిన సూచనలు సలహాలు జారీ చేశారు. అనంతరం S.G.S కాలేజీ వద్ద ఈ నెల ౨౧వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన పనులను పర్యవేక్షించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *