Breaking News

సెమి క్రిస్మస్ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ కుమార్

తెలుగు తేజం, నందిగామ : నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు తల్లిగారైన కీ॥శే॥ కస్తాల మరియమ్మ గారి ఆశీస్సులతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నందిగామ నియోజకవర్గ దైవ సేవకులు నిర్వహించనున్న గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుక పోస్టర్ ను వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కృష్ణాజిల్లా కోశాధికారి పాల్ శంకర రెడ్డి, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు హనోకు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ కుమార్ మాట్లాడుతూ ” ఈనెల 22న జరగనున్న సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా జరుపుకునే పండుగ రోజున నియోజకవర్గంలోని దైవ సేవకులు అందరూ సంతోషంగా గడపాలని, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నందిగామ పట్టణ వైఎస్సార్ సీపీ నాయకులు మండవ పిచ్చయ్య , వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు అంగడాల పూర్ణచందర్రావు, రంగారావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *