Breaking News

సమస్యాత్మక గ్రామాలలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన పోలీసు అధికారులు

తెలుగు తేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన ఇందుపల్లి, తాళ్లూరు, లో పోలీస్ అధికారులతో ఎస్ ఐ సోమేశ్వర రావు అధ్యక్షతన మార్చ్ ఫాస్ట్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డి యస్ పి నాగేశ్వరావు రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్క ఓటర్ వారి ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కావున ప్రజలందరూ తమ ఓటు హక్కును శాంతియుతంగా వేసుకోవాలనే వారు తెలిపారు. సీఐ చంద్రశేఖర్, ఎస్ ఐ వెంకటేశ్వరరావు, చిన్న బాబు, రామారావు, రామకృష్ణ, లక్ష్మణుడు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *