Breaking News

సమాజంలో విలేకరి పాత్ర కీలకమైనది: యువ పాత్రికేయుడు నవీన్ కుమార్

విజయవాడ: వాసవి క్లబ్ విజయవాడ పాయకాపురం ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా 6 వ రోజు బుధవారం కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి గోసేవ చేయడం జరిగింది. తదుపరి విలేకర్ల మహోత్సవం సందర్భంగా పత్రికా రంగంలో విశేష అనుభవం గడిచిన, గత 20 సంవత్సరాల నుంచి పత్రికా రంగానికి ఎనలేని సేవలను అందిస్తున్న పలువురు ప్రముఖులను సత్కరించారు. పందిరి బాల వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కత్తి కన్నా కలం గొప్పదన్నారు, సూర్యుడు కూడా లేని చోట విలేఖరి చూస్తాడన్నారు. సమాజంలోని అసమానతలను పోగొట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తారని విలేకరులను కొనియాడారు. రిపోర్టర్ శ్రీనివాస కుమార్ ని, వే టు న్యూస్ రిపోర్టర్ నవీన్ ని, ఫోటోగ్రాఫర్ పూర్ణ ని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా పాత్రికేయుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో విలేకరులను గుర్తించి వారిని గౌరవించడం అభినందనీయం అన్నారు. అర్హులైన నిరుపేదలకి సహాయ సహకారాలు అందించడంలో లైన్స్ క్లబ్ సంస్థ ముందుంటుందన్నారు. ప్రజా సమస్యలు సమాజంలో పరిష్కరించడానికి ముందుంటున్న పాత్రికేయులను గుర్తించి వారిని సన్మానించడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో
Vn KCGF పందిరి బాల వెంకట సుబ్రహ్మణ్యం.M.A., జోన్ చైర్మన్. Vn. KCGF పందిరి లక్ష్మి పద్మావతి,క్లబ్ అధ్యక్షురాలు, గౌరవ సలహాదారులు Vn KCGF తాత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు Vn రావూరి ప్రసాద్, డైరెక్టర్ Vn P.
కళ్యాణి మొదలగు సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *