Breaking News

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్

విజయవాడ : శ్రీ వివేకానంద సెంటినరీ హై స్కూల్ నందు బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణలో నేడు శ్రీకృష్ణ భగవాన్ ఆశయ సాధనకు ఇస్కాన్ సంస్థ, ఇస్కాన్ సభ్యులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. స్వామి వివేకానంద స్కూల్ నందు అన్ని పండుగల విశిష్టతను తెలిపేందుకు వివిధ కార్యక్రమాలు స్కూల్ యాజమాన్యం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థుల్లో దైవభక్తి కలిగి ఉండటం శుభసూచకం అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది శ్రీ అనంతలక్ష్మి సేవా సంఘం అధ్యక్షులు అప్పలరాజు, లైన్స్ క్లబ్ సుప్రీం ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ సమితి ప్రెసిడెంట్ రాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ త్రిమూర్తి రాజు స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ హరిత మాధవి తెలుగు మీడియం ప్రిన్సిపాల్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *