Breaking News

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తునాం : బొర్రా కిరణ్

తెలుగు తేజం, విజయవాడ : రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తరుపున మేము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ రూరల్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ అన్నారు. ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు బొర్రా కిరణ్ మాట్లాడుతూ హై కోర్టులో పంచాయతీ ఎన్నికలు జరుపమని తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో సుప్రీం కోర్ట్ లో పిటిషన్ ను ధాఖలు చేయటం చాలా బాధకరమని, ఇప్పటికయినా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రాష్ట్రము లో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుపాలని అన్నారు. అలాగే జిల్లాలో వున్నా కాంగ్రెస్ శ్రేణులు, పీసీసీ & డీసీసీ కార్యవర్గ సభ్యులు,”నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు”,మండల మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు,సీనియర్ పార్టీ నాయకులు అందరూ ప్రతి పంచాయతీలో పార్టీ తరుపున అభ్యర్థులతో నామినేషన్ లు వేయంచాల్సిందిగా బొర్రా కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమం లో పీసీసీ కార్యదరిశి పోతురాజు ఏసుదాస్,అక్కల ప్రసాద్, ఏం ఏ కె జిలాని,చెరుకు ఆనందరావు, అబ్దుల్ కలామ్ మరియు స్వర్గం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *