Breaking News

15 నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు

తెలుగు తేజం, మోపిదేవి : ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు పెండ్లి కుమారుడిని చేయుటతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ తెలిపారు. వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను మంగళవారం ఈవో ఆవిష్కరించారు. 16వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామి వారి కళ్యాణం, 17వ తేదీ రాత్రి 8.30 గంటలకు నంది వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం, 18 ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, అవభృద స్నానోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు వేద విద్వత్‌ సభ, పండిత సత్కారం, 19వ తేదీ ఉదయం 10 గంటలకు సుబ్రహ్మణ్యహవనం, రాత్రి 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు. ఎస్టేట్‌ దేవాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *