Breaking News

18న దేశవ్యాప్తంగా ‘రైల్‌ రోకో’!

నాలుగు గంటల కార్యక్రమానికి ఎస్‌కేఎం పిలుపు
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల జాతీయ/ రాష్ట్ర రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు.. తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సింఘూ సరిహద్దు వద్ద సమావేశమైన సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నాలుగు గంటల (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) పాటు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఈ నెల 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్‌ను కొనసాగనీయబోమని తెలిపింది. పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళిగా ఈ నెల 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *