Breaking News

16న బెజవాడ కనక దుర్గమ్మకు గాజుల అలంకారం

తెలుగు తేజం , విజయవాడ : ఇంద్ర కీలాద్రిఫై కొలువై ఉన్న జగన్మాత దుర్గమ్మకు ఈనెల 16న కార్తీక శుద్ధ విధియను పురస్కరించు కొని గాజులతో విశేష అలంకారం చేయనున్నట్లు దేవస్థాన ఈఓ సురేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో వైదిక కమిటీ సూచనల మేరకు ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని మాత్రమే గాజులతో అలంకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గాజులను లేదా నగదును విరాళంగా ఇవ్వ దలచిన భక్తులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు డొనేషన్ కాంటర్లో అందచేయాలని ఈవో కోరారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *