Breaking News

అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ పి ఓ నాగ వీర మురళీకృష్ణ కుటుంబానికి లక్ష రూపాయల విరాళం అందించిన పోలీస్ శాఖ

తెలుగుతేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట సర్కిల్లో నాగ వీర మురళి కృష్ణ శాండ్ చెక్ పోస్ట్ లో ఎస్ పి ఓ గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందారు.పోలీస్ శాఖలో సుమారు ఒక సంవత్సరం పాటు ఎటువంటి రిమార్క్ లేకుండా సేవలు అందించిన మురళి కృష్ణ కుటుంబం చాలా పేదరికంలో ఉన్నందున , సదరు విషయం తెలుసుకున్న స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్ రావు పై అధికారులైన కృష్ణ ఎస్ పి కి, నందిగామ డి.ఎస్.పి కు తెలియపరచ గా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరుపున ఒక లక్ష రూపాయలు ఏర్పాటు చేసి సదరు డబ్బులను నందిగామ డి.ఎస్.పి శ్రీ నాగేశ్వర్ రెడ్డి, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.చంద్ర శేఖర రావు, చేతుల మీదగా సోమవారం డిఎస్పీ కార్యాలయంలో సోమవారం మురళీకృష్ణ తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదు అందించారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ కుటుంబ సభ్యులు పోలీస్ శాఖ కు ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *