Breaking News

అన్ని జిల్లాలలో నివసించే నగరాల కులస్తుల్ని బీసీలుగా పరిగణించాలి :

అసెంబ్లీ వేదికగా ప్రతిపాదించిన పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి

అమరావతి : రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నగరాల కులస్తుల్ని బీసీలుగా పరిగణించాలని గురువారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లో వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నగరాల సామాజిక వర్గాన్ని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీ లలో చేర్చారని అయితే అది కొన్ని జిల్లాలలో ఉండే నగరాలకు మాత్రమే వర్తిస్తుందని మరి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి గతంలో నగరాల సామాజిక వర్గ నాయకులతో కలిసి తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ఆ ప్రక్రియను త్వరితగతిన అమలు లోకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నివసించే నగరాలను బీసీలుగా పరిగణించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *