Breaking News

అల్లూరు గ్రామంలో వైసిపి నుండి టీడీపీ లో చేరిక

తెలుగు తేజం, వీరులపాడు : వీరులపాడు మండలం : అల్లూరు గ్రామము నందు వైస్సార్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ లోకి వేమూరి నెహేమియా వారి 25 కుటుంబాల వారు మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ లోకి గురువారం చేరారు వారిని పార్టీ కండువా కప్పి తంగిరాల సౌమ్య సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా తంగిరాల సౌమ్య మాట్లడుతూ రాష్ట్రం అంతటా ఫ్యాక్షన్ పరిపాలన కొనసాగుతోందని రాజా రెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీలు నడుస్తున్నాయని ఎలక్షన్ కమీషనర్ ని ఒక సామాజిక వర్గం చూపించి నాన మాటలు మాట్లాడుతున్నారని
న్యాయం గెలిచింది మనం సిద్ధంగా ఉండాలి ఈ ఎలక్షన్లలో ప్రతి చోట తెలుగుదేశం జెండా ఎగురవేయాలని ఈ ప్రభుత్వానికి సంక్షేమము, అభివృద్ధి మానేసి మాట్లాడితే కేసులు పెట్టటం ఒక్కటే తెలుసనీ నిత్యావసరాలు మొత్తం కొండెక్కిపోయాయి, పెట్రోల్ , కరెంటు బిల్లులు పెరిగిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ భారం మొత్తం ప్రజల మీద వేసి వసులు చేస్తోందని అప్పులు తీసుకోచ్చి నవరత్నాలు పంచడం మాత్రమే తెలుసు జగన్మోహన్రెడ్డికి తెలుసన్నారు. టీడీపీ కార్య కర్తలు అందరూ కలిసికట్టుగా పని చేసి తెలుగుదేశం జెండాని ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *