Breaking News

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలి : ఎం ఆర్ ఓ రాజకుమారి

తెలుగు తేజం కంచికచర్ల : కంచికచర్ల తహసిల్దార్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో రాజకుమారి మాట్లాడుతూ రేపటి నుంచి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, 29 1 2021 తేదీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని, ప్రతిరోజు ఇదే సమయంలో స్వీకరించబడునని, 31 వ తారీకు వరకు సాయంత్రం 5 గంటల తరువాత వచ్చిన నామినేషన్లు స్వీకరించబడవు అని తెలిపారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిని గుర్తించి వారిపై బైండోవర్ చేసి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని ఆమె అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *