Breaking News

ఆధ్యాత్మిక విశ్వ గురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

తెలుగు తేజం, విజయవాడ : నగరంలోని స్థానిక ఎల్ఐసి నగర్ లో ఆర్ పి టవర్స్ సమీపంలో శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్థానిక మాచవరం సర్కిల్ సీఐ ఎం ప్రభాకర్ చేతులమీదుగా ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రాన్ని కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాచవరం సి ఐ ప్రభాకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థలు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి గురుదేవులు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహింప చేస్తూ ఇతర ఆధ్యాత్మిక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆయన తెలిపారు. చలివేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో స్ఫూర్తి కుటుంబ సభ్యులు ch నారాయణ రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *