Breaking News

ఆర్టీసీ బస్సులో రూ.50లక్షలు పట్టివేత

తెలుగు తేజం, కంచికచర్ల: కంచికచర్ల మండలం దొనకొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.50లక్షల నగదును పట్టుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సులో తీసుకెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకొని కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెద్ద మొత్తంలో నగదు రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

నందిగామ రూరల్ సిఐ కే సతీష్ వివరణ..

కంచికచర్ల పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన నందిగామ రూరల్ సీఐ సతీష్ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు ఒక వ్యక్తి అధిక మొత్తంలో డబ్బు తీసుకొస్తున్న సమాచారంపై తనిఖీలు నిర్వహించగా అడారి వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి వద్ద బ్యాగ్ తనిఖీ చేయగా 50 లక్షల రూపాయలు నగదు లభించాయని అందుకు సంబంధించిన పత్రాలు ఏమి అతని వద్ద లేని కారణంగా అదుపులోకి తీసుకొని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *