Breaking News

గోపినేనిపాలెం గ్రామంలో వై ఎస్ ఆర్ సి పి విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సామినేని ఉదయభాను

తెలుగు తేజం , వత్సవాయి (ప్రతినిధి ) వత్సవాయి మండలంలోని గోపినేనిపాలెం గ్రామంలో వైయస్సార్ సిపి పార్టీ గెలుపొందినందున సోమవారం సాయంత్రం గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల విజయోత్సవ కార్యక్రమమునకు ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను, మరియు తన్నీరు నాగేశ్వరరావు, గాదెల రామారావు విచ్చేశారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ వత్సవాయి మండలం లోని గోపినేనిపాలెం టీడీపీకి అండ గా ఉన్న విషయం అందరికీ విధి తమే! అటువంటి గ్రామంలో బాణావతు శ్రీనివాస రావు ని వైఎస్సార్సీపీ పార్టీ తరుపున అఖండ మెజారిటీతో గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ రాజశేఖర్రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలలోకి వెళ్లడం వల్ల ఇంతటి ఘన విజయాన్ని మనం చూడగలుగుతున్నాం అని అన్నారు. అంతేకాకుండా గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం అందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే రాంబాబు, కె వెంకటేశ్వరరావు,యం రామారావు, బి బాలాజీ, షేక్ లాలు, షేక్ బాబు, డాక్టర్ మాణిక్యరావు, ముప్పిడి రాజు, కె వెంకటేశ్వర్లు, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *