Breaking News

ఘనంగా విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ జయంతి

సాయుధ పోరాటంతో ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరుడు సుభాష్ చంద్రబోస్
మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

తెలుగు తేజం, నందిగామ టౌన్ : ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి భరతమాత దాస్యసృంకాల విముక్తికై పోరాడిన ధీరుడు, భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకొని శనివారం నందిగామ టౌన్ విజయటాకీస్ సెంటర్ నందు తెదేపా నేతలతో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఒక ఆలోచన కోసం ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తరువాత వెయ్యి జీవితాలలో ఆవతరిస్తుంది అన్న నేజాతీ స్ఫూర్తి భరత జాతి ఎన్నటికీ మరువదని ఈ సందర్భంగా గుర్తు చేసారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివాస్ గా జరుపుకోవడం గొప్ప విషయమని ఆయన దేశం కోసం చేసిన త్యాగం, ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్షతో స్వరాజ్యం విముక్తి పోరాటం ఇలా ఎన్నో ఆయన చేసిన పోరాటస్ఫూర్తి యువకులకు ఉద్యమం వైపు ఆకర్షించి ముందుకు నడింపించాయని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *