Breaking News

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వేల్పుల పరమేశ్వరావు ఆకస్మిక మృతి

తెలుగు తేజం, నందిగామ : సీనియర్ న్యాయవాది, నందిగామ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు,చందర్లపాడు మాజీ జెడ్పిటిసి సభ్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వేల్పుల పరమేశ్వరావు ఆకస్మికంగా మృతి చెందడo దురదృష్టకరమని కంచికచర్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంగిరెడ్డి రంగారావు మాస్టారు, ప్రెస్ క్లబ్ సభ్యులు నేడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారని, పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. పరమేశ్వరరావు కుంటుంబ సభ్యులకు కంచికచర్ల ప్రెస్ క్లబ్ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *