Breaking News

బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డా. మొండితోక జగన్ మోహన్ రావు

తెలుగు తేజం, నందిగామ : జాతిపిత మహాత్మా గాంధీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర పోరాట యోధుడని శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు . నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ,ముందుగా మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ,అనంతరం గాంధీ సెంటర్ కు ర్యాలీగా వెళ్లి మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు , ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు మాట్లాడుతూ గాంధీజీ పోరాటాల వల్లనే భారతీయులంతా ప్రజాస్వామ్య దేశంలో జీవనం సాగిస్తున్నారన్నారు ,భారత స్వాతంత్ర సముపార్జనలో మహాత్మ కృషి అనిర్వచనీయమని ,అహింస, సత్యం అనే ఆయుధాలతోనే భారతావనికి స్వాతంత్రాన్ని సాధించారని తెలిపారు , మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ,అందులో భాగంగానే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ,గ్రామ సచివాలయం వ్యవస్థలను రూపొందించి, ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలన చేరవేసే విధంగా పని చేస్తున్నారన్నారు ,పేద బడుగు బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక సామాజిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు ,

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *