Breaking News

భారత్‌లో 88 లక్షల దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 41,100 కరోనా కేసులు నమోదు కాగా.. 447 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 88,14,579కు చేరింది. 1,29,635 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,79,216 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స నుంచి కోలుకుని 82,05,728 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.09 శాతం కాగా.. మరణాల రేటు 1.47 శాతంగా ఉందని ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *