Breaking News

భారత్ బంద్..ఢిల్లీ శివార్లలో పలు రోడ్ల మూసివేత

యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ వివిధ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేర మంగళవారం జరుగుతున్న భారత్ బంద్ సందర్భంగా ఢిల్లీతోపాటు ఢిల్లీ శివార్లలోని పలు ప్రధాన రోడ్లను ముందుజాగ్రత్తగా ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఢిల్లీ శివార్లలోని సింగు, ఆచండి, పియావో మణియారి, మంగేష్, తిక్రీ, జరోడా సరిహద్దులను మూసివేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ లో తెలిపారు. జాతీయ రహదారి 44 ను రెండు వైపులా మూసివేశారు. ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి 24ను గాజిపూర్ సరిహద్దు వద్ద మూసివేశారు. 

44వ నంబరు జాతీయ రహదారిని మూసివేయడంతో ప్రయాణికులు లంపూర్, సఫియాబాద్, సబోలి సరిహద్దుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ముకార్బా, జిటికే రహదారి నుంచి ట్రాఫిక్ ను మళ్లించారు. నోయిడా లింకు రోడ్డులోని చిల్లా సరిమద్దును కూడా మూసివేశారు. గౌతమ్ బుద్ధ నగర్ లో రైతుల నిరసనలతో నోయిడా లింక్ రోడ్డును మూసివేశారు. భారత్ బంద్ సందర్భంగా ప్రధాన రహదారులపై  ట్రాఫిక్ అడ్డంకులున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. 

హర్యానా రాష్ట్రంలోని పలు రోడ్లపై రైతులు ధర్నా చేస్తున్నారని, దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని అదనపు డీజీపీ నవదీప్ సింగ్ చెప్పారు. ఢిల్లీ-అంబాలా, ఢిల్లీ -హిసార్, ఢిల్లీ పాల్వాల్, ఢిల్లీ -రేవారి ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఖుర్కిదౌలా టోల్ ప్లాజా, హీరోహోండా చౌక్, రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్ ల నుంచి ట్రాఫిక్ ను మళ్లించామని గురుగ్రామ్ డీసీపీ భరద్వాజ్ చెప్పారు. రైతుల నిరసనలతో ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రోడ్డును మూసివేశారు. నోయిడాలో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *