Breaking News

మందుబాబులకు అడ్డాగా మారిన పాఠశాల

గన్నవరం తెలుగు తేజం జూలై 9మందుబాబులకు అడ్డాగా మారిన పాఠశాల గాధ వెలుగులోకి వచ్చింది గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహ పురం కాలనీ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారిన వైనమిది కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో పాఠశాల మూసివేయబడింది ఈ పాఠశాలకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించక పోవడం వల్ల ఈ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది సాయంత్రం 6 గంటల తరువాత ఈ పాఠశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఈనేపథ్యంలో కాలనీవాసులు భయాందోళనలు చెందుతున్నారు సంబంధిత అధికారులు అసాంఘిక కార్య కలాపాలకు కు అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు అలాగే పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *