Breaking News

యువనేత అవినాష్ కు అండగా ఉంటాం… ప్రజాసమస్యలు పరిష్కరిస్తాం…

తెలుగు తేజం, విజయవాడ : విజయవాడ తూర్పు నియోజక వర్గంలోని ౨వ డివిజన్ మాచవరం మసీద్ రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగి నివాస గృహాలపై పడిన విషయం విదితమే. సంఘటన స్థలాన్ని తూర్పు నియోజక ఇంచార్జి దేవినేని అవినాష్ ఆనాడు సందర్శించి ప్రభుత్వం కొండా ప్రాంత వాసులకు అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఆమేరకు స్థానిక ౨ఫ్ డివిషన్కు చెందిన ఎండి మొయిన్ ఆధ్వర్యంలో విరిగిపడిన కొండచారియలను నివాసాలకు అదంకి లేకుండా తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా మొయిన్ మాట్లాడుతూ తూర్పు నియోజక వర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ పిలుపు మేరకు డివిజన్ కార్యకర్తలతో కలసి ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డివిషన్లో ప్రజా సమస్యలు వచ్చిన వాటిని యువనేత అవినాష్ దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కరానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *