Breaking News

రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. సోమవారం జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి రైతులు పండించిన ధాన్యం పంటను ఎఫ్.ఎ.క్యూ ధాన్యమునకు కనీస మద్దతు ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం క్వింటాకు గ్రేడ్ ఎ రకం రూ . 1888 /- మద్దత్తు ధర, సాధారణ రకం రూ. 1868 /- రూపాయలు కనీస మద్దతు ధర అందించడం జరుగుతుందని, అదేవిధంగా మొక్కజొన్న క్వింటాకు రూ . 1850 /- రూపాయలు రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *