Breaking News

వినియోగదారులకు గ్యాస్‌ షాక్

న్యూఢిల్లీ:వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది.

ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే గృహ వినియోగ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

14.2 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి.

పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి.

దీంతో దిల్లీలో సిలిండర్​ ధర రూ.999.50కి చేరింది.

హైదరాబాద్‌లో 14 కేజీల సిలిండర్‌ ధర రూ.1052కి చేరింది.

వాణిజ్య సిలిండర్​

కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్​ ధరను పెంచాయి చమురు సంస్థలు.

మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్​ ధరను రూ.102.50 పెంచటం వల్ల దిల్లీలో రూ.2253గా ఉన్న గ్యాస్​ బండ రూ.2355.50కి చేరింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *