Breaking News

గన్నవరం మండలం దివ్యాంగులకు శుభవార్త

50 శాతం రాయితీపై ఆర్టీసీ బస్సు పాసులు

తెలుగుతేజం, గన్నవరం ప్రతినిధి: మండల పరిధిలోని దివ్యాంగులకు 50% రాయితీపై ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేయుటకు ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు గన్నవరం ఆర్టీసీ డిపో మేనేజర్ పి శివాజీ తెలిపారు. ఈ బస్సు పాసులతో మూడు సంవత్సరాల పాటు 50% శాతం రాయితీతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయవచ్చు. ఈ బస్సు పాసులు కావలసిన దివ్యాంగులు ఆధార్ కార్డు జిరాక్స్, సదరం సర్టిఫికెట్ జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు రూ 100లు రుసుము చెల్లించి పై తేదీలలో గన్నవరం బస్ స్టేషన్ లో నిర్వహించు బస్సుపాస్ శిబిరము నందు బస్సు పాసులు పొందవచ్చునని శివాజీ పేర్కొన్నారు ఈ అవకాశాన్ని మండలంలోని దివ్యాంగులు వినియోగించుకొని బస్సు పాసులు పొందాలని శివాజీ కోరారు,.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *