జై శ్రీరామ్… జై దుర్గాభవానిమాతకి… జై భారత్ మాతకి…

ఘంటసాల–శ్రీకాకుళం ప్రాంతంలో నవరాత్రుల జోష్

తెలుగుతేజం (ఘంటసాల ప్రతినిధి):దసరా నవరాత్రుల ఆరంభం ఘంటసాల మండలంలో భక్తిశ్రద్ధలతో మొదలైంది. విశ్వహిందూ పరిషత్ ఖండ అధ్యక్షులు కొల్లిపర సుధాకర్‌రావు ఆధ్వర్యంలో దేవరకోట, చిట్టూర్పు, శ్రీకాకుళం పలు గ్రామాల్లో మొదటి రోజు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఉత్సవ కమిటీల చురుకైన పాత్రఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొప్పుల కోటేశ్వరరావు సమన్వయంతో భక్తి కార్యక్రమాలు కొనసాగాయి. మహిళా కార్యకర్తలు పోతార్లంక రాజేశ్వరి, బలే వెంకటలక్ష్మి, రేమల్లి ఆదిలక్ష్మి, అవనిగడ్డ శివ నాగలక్ష్మి తమ సేవలతో ఆకట్టుకున్నారు. కార్యకర్త కుందేటి వెంకటరామయ్య సహకారం అందించారు.భక్తుల సందడి – భజనలు, శోభాయాత్రలుగ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు, భజనలతో నవరాత్రి వాతావరణాన్ని మంత్రముగ్ధంగా మార్చారు.

జిల్లా అధ్యక్షుడి సందేశం:

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బూరగడ్డ శ్రీనాథ్ గారు భక్తులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ – “దేవి ఆశీర్వాదాలతో సమాజంలో శక్తి, శాంతి, ఐక్యత నెలకొనాలి” అని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *